Showing posts with label God/Godess. Show all posts
Showing posts with label God/Godess. Show all posts

Monday, April 27, 2026

ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మంచి మొక్కలు!

 ఇంటికి అదృష్టాన్ని తెచ్చే 5 మంచి మొక్కలు!


నేటి రోజుల్లో ఇంటి అలంకరణ వివిధ రీతుల్లో సాగుతోంది. అదృష్టాన్నిచ్చే మొక్కలను సైతం అలంకరణలో భాగంగా చేస్తున్నారు. 


ఈ మొక్కలు సంపదను తెచ్చిపెడతాయి. గతంలో అందరూ పవిత్రంగా భావించే తులసి మొక్క మాత్రమే ప్రతి ఇంటా వుండేది. 


ఇంటికి మంచి ఎనర్జీని కలిగిస్తుందని పవిత్రతను చేకూరుస్తుందని ఈ తులసి మొక్కను పెరటిలో వుంచి పూజలు కూడా చేస్తారు. 


అయితే సమాచార వ్యవస్ధ బాగా అభివృధ్ధి చెందటంతో ఇంటర్నెట్ లు చూసేవారంతా ప్రపంచ వ్యాప్తంగా ఇపుడు లక్కీ బాంబూ మొక్కలను తమ ఇండ్లలో పెడుతున్నారు. మన ప్రాంతాలలో కూడా ఇండ్లలో ఈ మొక్కలు పెంచుతున్నారు.

దిగువ పేర్కొన్న 5 మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా లక్కీ మొక్కలుగా పరిగణించబడుతున్నాయి. అవేమిటో, వాటికి కారణమేమిటో పరిశీలిద్దాం!


1. లక్కీ బాంబూ ప్లాంట్స్ -

Uploading: 264769 of 264769 bytes uploaded.


 ఇవి చైనాలో పుట్టినవైనప్పటికి ఇండియాలో ఫెంగ్ షూ ఇ లో భాగంగా అతిగా పెంచుతున్నారు. లక్కీ బాంబూ ప్లాంట్ అంటే నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బన్ తో కట్టి వుంటాయి. 

ఇది కుటుంబంలో ఐకమత్యానికి చిహ్నంగా భావిస్తారు. 

దీనినే అలంకరణగా కూడా పరిగణిస్తారు.


2. ఫోర్ లీఫ్ క్లోవర్ - 


ఇది అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందినది. ఇది ఒక అరుదైన మొక్క. 

నాలుగే ఆకులుంటాయి. 

ఈ మొక్క కనపడితే చాలు మంచి జరుగుతుందనే నమ్మకం 17వ శతాబ్దంనుండి వుంది.


3. తులసి మొక్క - 




తులసి మొక్క ప్రాధాన్యత హిందువులకందరకూ తెలిసినదే. 

దీనిని లక్ష్మీ దేవిగా భావించి హిందువులు పూజలు చేస్తారు. 

ఆకులు ఆహారాన్ని, దుస్తులను మొదలైనవాటిని శుభ్రం చేయటానకి ఉపయోగిస్తారు. నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు భావిస్తారు.


4. స్నేక్ ప్లాంట్ - 



ఈ మొక్క గాలిలో వున్న విషవాయువులను పీలుస్తుందని చెపుతారు. మంచితేమను కలిగి వుండి దాని పరిసరాలలో సహజమైన తేమను ఏర్పరుస్తుంది. 

ఇది లక్ మాత్రమే కాక ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.


5. మనీ ప్లాంట్ - 




అదృష్టాన్నిచ్చే మొక్కలలో ఇది పురాతన మొక్క. శీటిని ఒక బాటిల్ లోని నీటితో కూడా పెంచుతారు. 

ఇవి ఎక్కడపడితే అక్కడ దొరుకుతూనే వుంటాయి. 

వేగంగా పెరుగుతాయి. వీటిని కొంతమంది పైనుండి కిందకు పాకేలా చేస్తారు. కాని ఇది సరికాదు. 

మొక్క కిందనుండి పైకి పాకుతూ వుంటేనే ఐశ్వర్యం వస్తుంది.


శుభమస్తు 🕉️

Thursday, June 26, 2025

🎻యముడికీ ఓ గుడి..

 🎻🌹🙏యముడికీ ఓ గుడి...!!



🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿మన ప్రాణాలను హరిస్తాడు అని నమ్మే  యమధర్మరాజుకి కూడా ఎంతో భక్తితో పూజలు చేసే గుడి  ఉంది అంటే నమ్మగలరా ?

🌸  అది కూడా  మన తెలుగు రాష్ట్రంలో ఉంది. అక్కడ ఎన్నో విశేష పూజలు అందుకుంటాడు యముడు అంటే ఆశ్చర్యం గా అనిపించినా ...

🌿ఆ ఆలయం విశేషాలు మాత్రం ఆసక్తి కరంగా వుంటాయి.  కరీంనగర్ జిల్లా జగిత్యాల దగ్గర ఉన్న ఉగ్ర నరసింహస్వామి ఆలయంలో ఉంది ఈ గుడి. 

🌸తమ జాతకాలు బాలేవని,  ఏం చేసిన కలిసి రావట్లేదని, లేదా జాతకం ప్రకారం ప్రమాదాలు జరిగే సమయమని,

🌿 మానసిక ప్రశాంతత కరువయిందని ఇలా రకరకాల సమస్యలతో బాధపడే వారు  ఈ ఆలయం లోని యముని దర్శిస్తే ఆ సమస్యల నుంచి ఊరట లభిస్తుంది అని భక్తుల నమ్మకం.

🌸అలాగే శని గ్రహ దోషాలు, జాతక దోషాలు వున్న వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే ఆ భాధలు నుంచి ఉపశమనం లభిస్తుందిట.

🌿ఇక్కడ మండపంలో గల గండ దీపంలో నూనె పోసి యముని విగ్రహానికి దణ్ణం పెట్టుకుంటే గండాలన్ని  తొలగిపోతాయి అని కూడా భక్తుల నమ్మకం.

🌸ప్రతి  నెల భరణి  నక్షత్రం రోజున పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ .

🌿అంతేకాదు దీపావళికి రెండు రోజుల తరువాత వచ్చే 'యమ ద్వితీయ' రోజున యముడు తన చెల్లి అయిన యమునాదేవి ఇంటికి భోజనానికి వెళ్లి,

🌸తిరిగి యమలోకం వెళ్ళే ముందు ఈ రోజు ఎవరైతే తమ తోబుట్టువుల చేతి భోజనం తింటారో వారికి నరక బాధలు ఉండవని వరమిస్తాడని ప్రతీతి కదా !

🌿ఆ  రోజున ఇక్కడ  యమునికి విశేష పూజలు నిర్వహిస్తారు . యముని  దర్శించే వారు ముందుగా  గోదావరీ  నదిలో స్నానం చేసి, యమునికి పూజలు నిర్వహిస్తారు.

🌸ఇలా పేరు తలచుకోవటానికే భయపడే యముని అనుగ్రహం కోసం పూజలు నిర్వహించటం విశేషం గా చెప్పుకోవచ్చు.

🌿పదిహేను వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ గుడికి కార్తికంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

🌸మార్కండేయుడికి,మహా పతివ్రత  సావిత్రికే  కాదు మనకీ వరాలు ఇవ్వటానికి కొలువుతీరి ఉన్నాడు ధర్మపురిలో ఉన్న యముడు ...స్వస్తి...🚩🌞🙏🌹🎻

Thursday, May 29, 2025

అరుణాచలం (తిరువణ్ణామలై)


అరుణాచలం (తిరువణ్ణామలై)



 జీవకోటి యాత్రలో ఒక గీత అడ్డంగా పెడతారట. ఏమా గీత అంటే... అరుణాచల ప్రవేశానికి పూర్వం, తర్వాత అట. ‘అందరూ అరుణాచలంలోకి ప్రవేశించలేరు’ అని ఓ సిద్ధాంతం ఉంది. నేనూ ఈ సిద్ధాంతాన్ని నమ్మాను. ఎందుకంటే పదేళ్ల నుంచి అక్కడికి వెళ్లాలని వెళ్లలేకపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్లాలని సంకల్పించుకున్నాను.


అరుణాచలేశ్వరుడి చుట్టూ 14 కిమీ గిరి ప్రదక్షిణం నడక... ఇది కేవలం యాత్ర కాదు, ఒక జీవన మార్గం. ఈ ప్రదక్షిణ వల్ల మనస్సు శుద్ధి, ఆత్మాన్వేషణ, శివ అనుగ్రహం లభిస్తాయి. 

అరుణాచలం ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఎలా చేయాలి మీకున్నా అన్ని సందేహాలకు ఈ పోస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.


1. అరుణాచల క్షేత్ర మహిమ ఏమిటీ?


అరుణాచలం (తిరువణ్ణామలై) శైవమతంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటి. ఇది ఐదు భూతలింగాలలో అగ్నిలింగం కి ప్రతీక.

‘‘అరుణాచలేశ్వరుడు’’ అనగా – ఆరున్ (తేజస్సు), అచల (అచంచలుడు) – శివుడు స్వయంగా తేజోమయంగా లింగరూపంలో వెలసిన స్థలం.


శివుడు తన స్వరూపాన్ని చూపించడానికి ఎక్కడో వెలయించబడతాడు కానీ, ఇక్కడ ఆయన స్వయంగా ‘గిరిరూపం’ గా వెలసాడు. అందుకే అరుణాచలం కేవలం శిల కాదు – శివుడే!


అరుణాచలం గిరిప్రదక్షిణం చేసిన మహనీయులు – ఋషులు, యోగులు, గురువులు


1. భగవాన్ శ్రీ రమణ మహర్షి (Bhagavan Sri Ramana Maharshi)


అరుణాచల గిరిప్రదక్షిణాన్ని అత్యంత పవిత్ర సాధనంగా పరిగణించిన ఆధునిక యోగి.


ఆయ‌న జీవితంలో ఎన్నో సార్లు అరుణాచలం చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేశారు.


"గిరిప్రదక్షిణం అనేది పర్వతాన్ని కాకుండా, శివుని చుట్టూ తిరిగే విధానం" అని రమణ మహర్షి తత్వబోధ.


2. శ్రీ శేషాద్రి స్వామి (Sri Seshadri Swamigal)


రమణ మహర్షికి సమకాలికుడు.


తిరువణ్ణామలై లోనే నివసిస్తూ అరుణాచల గిరిప్రదక్షిణతో తన భక్తులను ఉద్ధరించారు.


3. గౌతమ మహర్షి (Gautama Maharshi)


పురాణాల ప్రకారం, గౌతమ మహర్షి అరుణాచల ప్రాంతంలో తపస్సు చేసి శివానుగ్రహాన్ని పొందాడు.


శివుడు ఈ ప్రాంతంలో స్వయంగా ‘తేజో లింగంగా’ వెలసినట్లు మొదటి సంబందం గౌతమ మహర్షి ద్వారా తెలియజేయబడింది.


4. విరూపాక్ష ఋషి (Virupaksha Deva or Rishi)


ఆయన సాధనానికి ప్రసిద్ధమైన విరూపాక్ష గుహ ఇప్పటికీ అరుణాచల పర్వతంలో ఉంది.


ఆయన అరుణాచలాన్ని శివ స్వరూపంగా చూసి దశాబ్దాలుగా ఆ గుహలో నివసించారు.


5. యోగి రామయ్య (Yogi Ramsuratkumar)


ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన గాఢమైన తపస్వి.


తిరువణ్ణామలైలో అరుణాచలేశ్వరుని చుట్టూ ఎన్నో సార్లు గిరిప్రదక్షిణ చేశాడు.


“Viswaroopa of Arunachala” అనే ఆయన మాటలు ప్రసిద్ధం.


6. శ్రీ శివప్రభునంద స్వామి (Sri Shivaprabhananda Swami)


అరుణాచలం గురించి విస్తృతంగా గ్రంథాలు రచించిన ఋషిసమానం గురువు.


గిరిప్రదక్షిణ సాధన విధానాన్ని తాను అనుసరించడమే కాక, భక్తులకు కూడా ప్రేరణగా నిలిచారు.


ఇతర ప్రసిద్ధ ఆధ్యాత్మికుల ప్రస్తావన:


అప్పర్, సంధానర్, జ్ఞానసంబంధర్, మాణిక్యవాచకర్ వంటి నాయనార్లు అరుణాచలేశ్వరుని భక్తులుగా ప్రసిద్ధులు.


శ్రీ శంకరాచార్యులు కూడా అరుణాచల మహత్యాన్ని అభినందిస్తూ కొన్ని శ్లోకాల ద్వారా గుర్తించారని నమ్మకం.


అనేక సాధకులు పేరు తెలియని యోగులు ఈ పర్వతాన్ని తమ జీవితధ్యేయంగా మార్చుకున్నారు.


సూచనలు:


ఈ గురువులు చేసిన గిరిప్రదక్షిణ అనుభవాలు వారి ఆశ్రమాలలో, గుహలలో, ప్రేరణాత్మక రచనలలో ఉద్ఘాటించబడ్డాయి. అరుణాచల పర్వతం కేవలం శిల గోపురం కాదు – అది జీవంత శివ తత్త్వం. గురువులు నడిచిన ఆ బాటలో మనం కూడా ఒక అడుగు వేయడం సాకారం మార్గానికి మొదటి మెట్టు.


2. అరుణాచల గిరి ప్రదక్షిణం ఎలా చేయాలి?


గిరి ప్రదక్షిణం అంటే అరుణాచల పర్వతాన్ని చుట్టూ నడిచి ప్రదక్షిణ చేయడం. దాదాపు 14 కి.మీ. మేర నడక ఉంటుంది. ఇది సాధారణ నడక కాదు – ఒక ఆధ్యాత్మిక సాధన.


#ఎలా_చేయాలి?


కాలినడకన చేయాలి. సాధ్యమైనంత వరకూ పాదయాత్రే శ్రేష్ఠం. శరీర శ్రమ, మనస్సు ఏకాగ్రతతో భక్తి లభిస్తుంది.


“అరుణాచల శివా” అనే నామస్మరణతో నడవాలి.


రాత్రిపూట ప్రదక్షిణ చేయడం పవిత్రంగా భావిస్తారు – చందమామ వెలుతురులో పర్వతం దేవతా స్వరూపంగా అనిపిస్తుంది.


గొప్ప శౌచం, దినచర్య, ఆహార నియమాలు పాటిస్తూ చేయాలి.


ప్రదక్షిణ ప్రారంభానికి ముందు స్నానం చేయడం, శుద్ధ బద్ధంగా ఉండడం శుభకరం.


ప్రదక్షిణలో #ముఖ్యమైనక్షేత్రాలు:


అష్టలింగాలు (ఇవి 8 మూలదిక్కులకు ప్రతీకలు): ఇంద్ర లింగం, అగ్ని లింగం, యమ లింగం, నిరుతి లింగం, వరుణ లింగం, వాయు లింగం, కుబేర లింగం, ఈశాన్య లింగం.

మనం గిరిప్రదక్షిణం చేస్తున్న కొండ చుట్టూ ఈ 8 లింగాలు రోడ్డు పక్కనే ఉంటాయి. వాటిని దర్శించుకొని మనం గిరిప్రదక్షిణం చేస్తే మంచిది. 

అలాగే మార్గం మద్యలో మోక్షమార్గం కూడా ఉంటుంది. ఆ మార్గం గుండా ప్రవేశిస్తే మోక్షం కలుగుతుంది అని చెప్పుతుంటారు.


సద్గురు రమణ మహర్షి ఆశ్రమం.


అనేక ప్రాచీన ఆలయాలు, తీర్థాలు, పుణ్యసంఘాలు ఈ మార్గంలో ఉంటాయి.


3. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడవలన #ప్రయోజనం ఏమిటి?


పాప విమోచనం: గత జన్మల పాపాలు తొలగుతాయి.


మనశ్శాంతి: పర్వతం స్వయంగా శివుడైనందున, చుట్టూ తిరిగితే మనస్సుకు శాంతి లభిస్తుంది.


కార్మిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చే మార్గం.


ఇచ్ఛల సాఫల్యం: సరైన నియమాలతో, శ్రద్ధతో చేసిన గిరిప్రదక్షిణ ఫలితంగా కోరికలు నెరవేరతాయి.


4. #అరుణాచలం ఎలా వెళ్ళాలి?


అరుణాచలం స్థానం: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై పట్టణంలో ఉంది.


#హైదరాబాద్‌ నుంచి వెళ్ళాలంటే:


#బస్సు: హైదరాబాద్‌ – తిరువణ్ణామలైకి ప్రత్యక్ష బస్సు లేదు. అయితే చిత్తూరు/వెల్లూరు వరకు బస్సు/రైలు ఎక్కి, అక్కడి నుంచి స్థానిక బస్సు లేదా టాక్సీ ద్వారా వెళ్లొచ్చు.


#రైలు: తిరుపతి/కాట్పాడి (వెల్లూరు) వరకు రైలు తీసుకుని అక్కడి నుంచి అరుణాచలానికి వెళ్లవచ్చు.


#కారు: సొంత వాహనంలో వెళ్లాలంటే ~650 కిమీ దూరం, సుమారు 12 గంటలు పడుతుంది.


#విమాన మార్గం: చెన్నై వరకు విమానం తీసుకుని, అక్కడి నుంచి బస్సు లేదా కారు (సుమారు 190 కి.మీ) ద్వారా.


5. అరుణాచలంలో ఉండడానికి ఏర్పాట్లు:


#ధర్మశాలలు:

 రమణాశ్రమం, సద్గురు ఆశ్రమాలు, శైవ మఠాలు.


#హోటల్స్: తిరువణ్ణామలైలో మంచి హోటల్స్ అందుబాటులో ఉంటాయి – ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది.


#ఆహారం: సాధారణంగా స్వచ్చమైన సౌత్ ఇండియన్ భోజనం అందుబాటులో ఉంటుంది.


#సూచనలు:


1. మొదటిసారి వెళ్లే వారు రమణాశ్రమంలో గైడ్ చేయించే సమాచారాన్ని తీసుకోవచ్చు.


2. క్షేత్రానికి వెళ్లేముందు శారీరకంగా, మానసికంగా సన్నద్ధత అవసరం.


3. గిరి ప్రదక్షిణ సమయంలో చెప్పులు తొలగించి నడవడం ఉత్తమంగా భావిస్తారు.


4. వర్షాకాలం కాకుండా, శీతాకాలం (నవంబర్–ఫిబ్రవరి) ఉత్తమ సమయం.

Tuesday, July 9, 2024

బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం

 బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం


బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం : హైదరాబాదులోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఆషాఢ బోనాల సందర్భంగానే మహోత్సవంగా నిర్వహిస్తారు. హైదరాబాదులోని బల్కంపేటలో రేణుక ఎల్లమ్మ భక్తజనుల ఆరాధనలందుకుంటోంది. ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయంలో ఎల్లమ్మ జలాధివాసిని, స్వయంవ్యక్తమైన తల్లి. అమ్మవారి ఆలయంలో క్షేత్రపాలకురాలిగా ఆరోగ్య ప్రదాయినియైన శీతలాదేవిని స్థాపించారు. జలాధివాసినిగా అమ్మవారు ఆవిర్భవించిన కారణంగా ఆమెను జలదుర్గా స్వరూపంగా ఆర్చిస్తారు. ప్రస్తుతం ఆలయం ఏర్పడి, అర్చామూర్తులు వెలసినా, మూలస్వరూపమైన అమ్మవారిని జలాధివాసినిగా దర్శించవచ్చు. క్షేత్రపాలకురాలు శీతలాదేవి (పోచమ్మ) కూడా ఆలయంలోనే దర్శనమిస్తుంది. కొత్త దంపతులు పసుపుబట్టలతో అమ్మవారిని దర్శించుకుంటే సంసారం ఏ కష్టాలు, చింతలు లేకుండా సాగుతుందని నమ్మకం. ఆలయంలో మూలమూర్తి శిరస్సు వెనుక భాగంలో ఉన్న బావి నుంచి వచ్చే ఊటనీటినే భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకుని స్నానం చేస్తే కలరా, మశూచి, గజ్జి, తామర వంటి వ్యాధులు సమసిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నీటితో ఇళ్లను శుద్ధిచేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని వారి నమ్మకం. ప్రతి ఏటా ఆషాఢమాసం మొదటి మంగళవారం నాడు ఎల్లమ్మతల్లి కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. మూడురోజుల పాటు జరిగే ఈ కల్యాణోత్సవాలుంటాయి. ఎదుర్కోలు, కల్యాణం, రథోత్సవం అనే మూడు దశలుగా సాగే ఈ కార్యక్రమంలో రథోత్సవం నేత్రపర్వంగా సాగుతుంది.

Sunday, August 30, 2020

ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాo

 :violin::rose::pray:ముస్లిం దేశం 28 సంవత్సరాలలో 800 కోట్ల ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాన్ని నిర్మించింది

ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహాo

ఈ ముస్లిం దేశంలో విష్ణువు యొక్క ఎత్తైన విగ్రహం నిర్మించడానికి 26 సంవత్సరాలు  పట్టింది | News Track Live, NewsTrack Telugu 1
విష్ణువు యొక్క ఈ విగ్రహం ఇండోనేషియాలో ఉంది, ఇది సుమారు 122 అడుగుల ఎత్తు మరియు 64 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం రాగి మరియు ఇత్తడితో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 2018 సంవత్సరంలో పూర్తయింది.

హిందూ మతంలో, విష్ణువు శ్రేయస్సు మరియు శోభకు చిహ్నం. బ్రహ్మ అనే శంకర్ త్రయంలో విష్ణువు భూమిని అనుచరుడిగా భావిస్తారు. విష్ణువును వేర్వేరు పేర్లతో పూజించని భారతదేశంలో ఏ మూలలోనూ లేదు. కానీ ప్రపంచంలోనే ఎత్తైన విష్ణువు విగ్రహం భారతదేశంలో లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ముస్లిం జనాభా పరంగా ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశంలో ఇది ఉంది. విష్ణు విగ్రహం ఇండోనేషియాలో ఉంది, ఇది సుమారు 122 అడుగుల ఎత్తు మరియు 64 అడుగుల వెడల్పుతో ఉంది. ఈ విగ్రహం రాగి మరియు ఇత్తడితో తయారు చేయబడింది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 28 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం 2018 సంవత్సరంలో పూర్తయింది మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు దీనిని చూడటానికి వస్తారు.

ఇది ఎలా ప్రారంభమైంది.. 1979 లో ఇండోనేషియాలో నివసించిన శిల్పి బప్పా న్యూమాన్ నుయార్టా, హిందూ చిహ్నం యొక్క భారీ విగ్రహాన్ని తయారు చేయాలని కలలు కన్నారు. కలలు కనేది చాలా సులభం, కాని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విగ్రహాన్ని తయారు చేయడం చాలా కష్టమైన పని. ఈ విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించడానికి 1980 లలో ఒక సంస్థ ఏర్పడిందని చెబుతారు. ఆయన పర్యవేక్షణలో అన్ని పనులు చేయాలని నిర్ణయించారు. ఈ విగ్రహం యొక్క నిర్మాణంపై కృషి జరిగింది.
ఈ రోజు వరకు ప్రపంచంలో తయారు చేయని ఒక రచనను న్యూమాన్ నుయార్టా సృష్టించాల్సి వచ్చింది. ఎవరైతే చూసేవారు, చూస్తూ ఉండండి. సుదీర్ఘ ప్రణాళిక మరియు డబ్బు ఏర్పాట్ల తరువాత, ఈ విగ్రహం తయారీ 1994 లో సుమారు 15 సంవత్సరాల తరువాత ప్రారంభమైంది. ఈ విగ్రహం నిర్మాణానికి ఇండోనేషియాలోని అనేక ప్రభుత్వాలు సహాయపడ్డాయి. పెద్ద బడ్జెట్ కారణంగా చాలా సార్లు పని ఆగిపోయింది. 2007 నుండి 2013 వరకు, దీని నిర్మాణం సుమారు 6 సంవత్సరాలు ఆగిపోయింది. కానీ ఆ తర్వాత పని ప్రారంభమైంది మరియు దీనికి మరో ఐదేళ్ళు పట్టింది...స్వస్తి:pray::rose:

ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు.............!!

 :violin::rose::pray: ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు.............!!

:hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face::hibiscus::cherry_blossom::sun_with_face:
సృష్టికి ఆద్యం ఆదివారం.
దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది.
చివరకు సూర్యునితోనే అంతమవుతుంది...
సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి.
అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం.
వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా
ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకండి..
ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని.
మన వేదాల్లో ఉంది.
ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి.
ఆరోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది.
ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి.
అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం.
దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు...
మన దేశానికి బ్రిటీష్ వారు వచ్చినపుడు భారతీయుల్లో ఉన్న మేధోశక్తికి...సంపూర్ణ ఆరోగ్యానికి అబ్బురపడ్డారు. ఎందుకు భారతీయులు ఉత్తేజంగా... ఉల్లాసంగా.. సిరిసంపదలతో తులతూగుతున్నారో అన్వేషించారు. చివరకు ఆదివారం నాడు మన పూర్వీకులు అవలంబిస్తున్న నియమాలే అందుకు
కారణమని తెలుసుకున్నారు...
భారతీయుల్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచాన్ని జయించగలరని అనుమానం ఇంగ్లీషువాళ్లల్లో కలిగింది. ఎలాగైనా సరే భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయాలని భావించారు.
దీంతో ఆదివారం రోజుని సెలవుదినంగా ప్రకటించడంతో పాటు ఆరోజున మద్యం మాంసంతో పాటు నియమాలు పాటించకుండా మానేసేలా చేశారు...
ప్రపంచంలోని చాలా భాగాన్ని ఇంగ్లీషువారే పాలించడంతో ఆనాటి నుంచి ఆదివారం సెలవు దినంగా వారు ప్రకటించారు.
కానీ తాము మాత్రం ఆదివారం నాడు ఖచ్చితంగా భగవంతుణ్ణి ఆరాధించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఆరోజున కచ్చితంగా తమ ప్రార్ధనాస్ధలాలకి రావాలనే నియమాన్ని పెట్టు కున్నారు...
ఇలా మన ఆచారానికి మత రంగు అద్దుకుని ఆదివారం నాటి శక్తిని క్రిష్టియన్స్ పొందుతున్నారు.
కానీ నాటి నుంచి మనం మాత్రం ఆదివారం
'మందు ముక్క' అంటూ తమ తరతరాల ఆచారాన్ని పక్కదోవ పట్టించుకున్నాము...
కాబట్టి ఇప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని
మనం గుర్తించాలి.
ఆదివారం రోజున మన చేతనైన నియమాలు పాటించాలి, మన భవిష్యత్ తరముల కొరకు -
మన పిల్లలు అందరూ పాటించేలా చేయాలి ...!
శ్రీ సూర్యనారాయణ అనుగ్రహ ప్రాప్తిరస్తు
సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు..!!
Srikala Bhakthi - ఆదివారం అత్యంత శక్తి వంతమైన... | Facebook
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే

సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం

బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం

సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్

ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా

స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి

ప్రపంచంలోనేఅతి_పురాతనమైన_అరుదైన_దేవాలయం భారతదేశంలో_మొదటి_శివాలయం

 :violin::rose::pray: :tulip::tulip:ప్రపంచంలోనేఅతి_పురాతనమైన_అరుదైన_దేవాలయం

భారతదేశంలో_మొదటి_శివాలయం
Gudimallam - Sri Parasurameswara Temple - Tirupati Tirumala Info

:hibiscus:గుడిమల్లం:hibiscus:

:hibiscus:గుడిమల్లం, చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ గ్రామం. చారిత్రకంగా ప్రాముఖ్యమైనది. ఇచ్చట ఆంధ్ర శాతవాహనుల కాలం నాటి పురాతన శివాలయం ఉంది. ఇది క్రీ .పూ 2 లేదా 3 శతాబ్దములో నిర్మించినట్లు ఇక్కడ బయలుపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు. ఈ ఆలయమునకు సంబంధించిన మరికొంత సమాచారము చంద్రగిరి కోటలో గల మ్యూజియంలో లభ్యమవుతున్నది.
Around Tirupati - Gudimallam - A Lingam like no other!

ఈ దేవాలయాన్ని కొంతకాలం చంద్రగిరి రాజులు ఉచ్ఛస్థితిలో నిలిపారు. తదనంతర కాలంలో ముస్లిం పాలకులు చంద్రగిరి సంస్థానంతో పాటు ఈ దేవాలయాన్ని కూడా చాలా వరకు పాడు చేసారు. కాకుంటే మూలవిరాట్ స్వామికి మాత్రం హాని కలగలేదు.:hibiscus:

:hibiscus:గుడిమల్లం శివలింగ విశిష్టత:

గుడిమల్లం శివాలయంలోని శివుడు పరశురామేశ్వరుడుగా పూజలందుకుంటున్నాడు. ఇక్కడి శివలింగానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుంది . ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపములో కాకుండా శివుడు మానవ రూపములో మహావీరుడైన వేటగాని వలె ఉన్నాడు. ఈ లింగము ముదురు కాఫీరంగులో ఉన్న రాతితో చేయబడిన మానుష లింగము. లింగము సుమారుగా ఐదు అడుగుల పొడవు, ఒక అడుగు వెడల్పు కలిగి ఉంది. లింగముపైన ముందువైపు ఉబ్బెత్తుగానూ లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు, అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన (స్థానకమూర్తి) రూపంలో ఉన్నాడు. స్వామి రెండు చేతులతో ఉన్నాడు. కుడిచేతితో ఒక గొర్రెపోతు (తలక్రిందుగా) యొక్క కాళ్ళు పట్టుకొనగా, ఎడమచేతిలో చిన్నగిన్నె (చిప్ప) ను పట్టుకొన్నాడు. ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్డలి తగిలించుకొని ఉన్నాడు. స్వామి జటాభార (జటలన్నీ పైన ముడివేసినట్లు) తలకట్టుతో, చెవులకు అనేక రింగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి, నడుముచుట్టూ చుట్టి, మధ్యలో క్రిందకు వ్రేలాడుతున్నట్లు ఉన్న అర్ధోరుకము (నడుము నుండి మోకాళ్ళ వరకూ ఉండే వస్త్రము) ధరించి ఉన్నాడు. ఆ వస్త్రము మధ్యలో వ్రేలాడుతున్న మడతలు అతి స్పష్టముగా కనుపిస్తున్నాయి. ఆ వస్త్రము అతి సున్నితమైనది అన్నట్లుగా అందుండి స్వామివారి శరీరభాగములు స్పష్టముగా కనుపిస్తున్నాయి. స్వామికి యగ్నోపవీతం లేకపోవడం ఒక విశేషం. లింగపు అగ్రభాగము, క్రింది పొడవైన స్తంభ భాగములను విడదీస్తున్నట్లుగా ఒక లోతైన పల్లము పడిన గీత స్పష్టముగా ఉండి, మొత్తము లింగము, పురుషాంగమును పోలి ఉంది. ఈ లింగము, అతిప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది. ఆకాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది. గుడిమల్లం 2009 వరకు వురావస్థు శాఖ వారి ఆధీనంలో ఉంది. పూజా పునస్కారాలు ఏవీ జరగలేదు. కనుక ప్రజలు ఎక్కువగా రాలేదు. పురావస్తు శాఖ వారి ఉద్యోగి ఒకరు దానికి సంరక్షకుడిగా వుండి అరుదుగా వచ్చే సందర్శకులకు చూపిస్తూ ఉంటారు. గుడిమల్లం చిన్న పల్లెటూరు. తిరుపతికి సుమారు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వారాలయం అని కూడా అంటారు. అంత దూరం వెళ్ళి చూడ లేని వారికి ఈ ఆలయంలోని మూల విరాట్టును అన్ని విధాల పోలిన ప్రతి రూపాన్ని చంద్రగిరి కోటలోని ప్రదర్శన శాలలో ప్రదర్శనకు పెట్టారు. అక్కడ దీన్ని చూడవచ్చు. ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉన్నది. ఇది క్రీస్తుపూర్వం 1వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్ర కారులంటున్నారు. 1911లో గోపీనాధరావు అనే పురాతన శాస్త్రవేత్త సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుష అంగాన్ని పోలి ఉండే ఏడు అడుగుల ఈ శివ లింగం పై ఒక చేత్తో పశువును, మరో చేత్తో గొర్రెను పట్టుకుని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా, దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ రుగ్వేద కాలం నాటిదని శాస్త్రకారుల అంచనా. ప్రాచీన శైవపూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజ పుష్ఠాకారం లో గంభీరంగా ఉంటుంది.ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వరాలయంగా పేర్కొన్నారు. ఈ లింగం చుట్టూ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం రెండవ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయట పడ్డాయి. చోళ, పల్లవ, గంగపల్లవ, రాయల కాలంలో నిత్యం ధూప, దీప, నైవేద్యాలతో కళకళలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. చాలా విగ్రహాలు చోరికి గురయ్యాయి. ఆర్కియాలజీ వెబ్‌సైట్‌లో ఇంత ప్రముఖమైన శివలింగం గురించి కనీస సమాచారం లేదు. గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు. ఏ ఎస్‌ ఐ ధర్మాన కనీసం పూజలు కూడా చేసుకోలేక పోతున్నామని…వాపోతున్న గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన వున్నం గుణశేఖర నాయుడు 2006 నుండి 2008 వరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆర్కియాలిజీతో సమాచార చట్టం ఆయుధంగా యుద్ధం చేసి వారిని కేంద్ర సమాచార చట్టం ముందు నిలబెట్
టాడు. ఈ గుడికి సంబంధించిన ఆస్తుల వివరాలు అటుంచితే కనీసం గుడికి సంబంధించిన సాహిత్యం కూడా వారి దగ్గర లేదనే నగ్నసత్యం బయట పడింది. ఈ క్రమంలో గుణశేఖర నాయుడు చేసిన కృషి ఫలితంగా 2009లో గుడిలో పూజలు జరిపేందుకు గ్రామస్తులకు అనుమతి సాధించాడు. గతంలో ఎపుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణాలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇట్లాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన ‘పరమేశ్వర టెంపుల్‌ ఎట్‌ గుడిమల్లం’ ‘డెవలప్‌ మెంట్‌ ఆఫ్‌ ఎర్లీ శైవ ఆర్ట్‌ అండ్‌ అర్కిటెక్చర్‌ ‘ అనే రెండు పుస్తకాలు, మరి కొన్ని శిల్ప, కళా చరిత్ర పరిశోధన పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. ఇపుడిపుడే ఈ ఆలయం మార్కెట్‌ దేముడి మాయలో పడబోతుంది. కోట్ల రూపాయల హెరిటేజ్‌ ప్రాజెక్టులో ఇదీ భాగం అయింది. అంబికా సోనీ ఇటీవలే ఇక్కడ అంగ పూజలు జరిపారు. ఒక ఎంపీ ఇక్కడ గెస్ట్‌హౌస్‌ కట్టే ప్లాన్‌లో ఉన్నారు. ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి.:hibiscus:

:hibiscus:మరొక పురాణ కథ...

పురాణాలలోని కథ తన తండ్రి ప్రోద్బలంతో అతని తల్లి శిరఛ్చేదం పరశురాముడు చెబుతుంది. ఆవేదన నుంచి కోలుకోవడానికి గాను ఋషులు ఒక శివ లింగం వెతికి దానికి పూజించవలసింది గా సూచిస్తారు. చాలాసార్లు శోధించిన తరువాత, పరశురాముడు ఈఅడవి మధ్యలో ఒక లింగాన్ని గుర్తించి అటుపై ఆలయ సమీపంలోని ఒక చెరువు తవ్వి పూజించు చుండెను. ప్రతి రోజు ఆచెరువు ఒక దైవిక పుష్పం పెరుగుతూ ఉండగా, దానితో ఆతను శివునికి పూజిస్తూ ఉండేవాడు. ఆ పువ్వును అడవి జంతువుల నుండి కాపాడటం కొరకు ఆతను ఒక యక్షుడుని (చిత్రసేనుడు) కాపలాగా ఉంచుతాడు. అందుకు గాను పరశురాముడు రోజూ ఆతనికి ఒక జీవి, ఆటబొమ్మలను తీసుకొని ఇచ్చేవాడు. ఒకమారు పరశురాముడు లేని సమయంలో చిత్రసేనుడు (బ్రహ్మ భక్తుడు) ఆ పుష్పంతో శివునికి పూజ చేస్తాడు. పరశురాముడు వచ్చేసరికి పుష్పం లేకపోవడం చూచి కోపోధ్రిక్తుడై చిత్రసేనుడు మీద దెండెత్తుతాడు. ఆ యుద్ధం 14 సంవత్సరాల పాటు కొనసాగింది, అందువల్ల ఆప్రదేశం ఒక పెద్ద గొయ్య, లేదా పల్లం లా తయారి అయింది. అందుకే ఈ ప్రదేశానికి గుడిపల్లం అని పేరు వచ్చింది అంటారు. ఆయుధ్ధం ఎంతకీ ముగియక పోవడంతో పరమశివుడు వారిరువురికి ప్రత్యక్ష్యమై వారిరువురిని శాంతపరిచి, వారి భక్తికి మెచ్చి తాను రెండుగా విచ్ఛిన్నమై వారిలో ఏకమవుతాడు. అందుకు గాని ఇక్కడి లింగము ఒక ఆకారము పరశురాముడు (విష్ణు రూపం) ఒక చేతిలో వేటాడిన మృగముతోటి, రెండవ చేతిలో ఒక కల్లుకుండ ఉండినట్లు, చిత్రసేనుడు (బ్రహ్మ) ముఖముతో, శివడు లింగ రూపముతో మలచబడెనని ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ ఆలయానికి సమబంధించి మరియొక రహస్యమైన సన్నివేశం ప్రాచుర్యంలో ఉంది. అది ఈ ప్రధాన గదిలో ప్రతి అరవై సంవత్సరాలకు వరదలు వచ్చి లోపలభాగం మొత్తం వరద నీటితో మునుగి పోతుంది.. ఒక చిన్న భూగర్భ తొట్టి, దానిని కలుపబడి ఒక వాహిక శివలింగం ప్రక్కన నేటికీ కూడా చూడవచ్చు. ఈ వరద నీరు అకస్మాత్తుగా, శివలింగం పైభాగానికి తాకి అటుపై ఒక్కసారిగా క్రిందికి ప్రవహిస్తుంది. ఈ భూగర్భ ట్యాంక్ తరువాత ఎండి పోతుంది. ఇది 2005 డిసెంబరు 4 లో జరిగినట్లు ఆలయ సర్వే అటెండంతు పి.సీనప్ప ఆలయ జాబితా పుస్తకంలో వ్రాసినట్లు తెలుపబడింది. ఆ వరద నీదు అలానే ఒక 4 గంటలు ఉండి అటుపై మరల ఆలయంలో ఏమీ జరుగనట్లు అదృశ్యమైనదని వ్రాసినారు. రామయ్య అనే 75 ఏళ్ళ గ్రామస్థుడు దీనిని తాను 1945 సం.లో చూచినట్లు తెలిపినట్లు పలువురు వివరించిరి. ఆలయ మరో అధ్బుత ఉంది. పెరుగుతున్న సూర్యుని కిరణాలు ఉత్తరాయణము, దక్షిణాయనములో రెండుసార్లు ఈ రాతి గోడలపై చెక్కిన గ్రిల్ గుండా ప్రధాన శివలింగం యొక్క నుదిటి నేరుగా వస్తాయి.:hibiscus:

:hibiscus:మరికొన్ని ఆలయ విశేషాలుసవరించు
విశాలమైన ఈ దేవాలయ ప్రాంగణమున యెన్నియో చిన్న గుళ్ళున్నవి. అన్నింటిని చుట్టునూ, ఆవలి ఇటుక ప్రాకారగోడ, నలువైపుల ఉంది.ఈ ప్రాకారమునకు పడమటివైపున పెద్ద గోపుర ద్వారము ఉంది. ఈ గోపురద్వారము, స్వామివారి అభిషేకజలమునకూ కట్టిన బావి యాదవదేవరాయలు కాలమునకు (క్రీ.శ.13-14 శతాబ్దము) చెందినది. ముఖ్య దేవాలయము- పరశురామేశ్వరస్వామి పేరున పలువబడుచున్నది. ఈ ఆలయమునకు వాయవ్య దిశన అమ్మవారి దేవాలయము ఉంది. దానిని ఆనుకొని దక్షిణమున వల్లీ-దేవసేనా సమేత కార్తికేయస్వామి గుడి ఉంది. పై రెండును తూర్పు ద్వారమును కల్గిఉన్నవి. తూర్పు చివర ఆనుకొని సూర్యనారాయణుని దేవాలయము ఉంది. ఈ చిన్ని ఆలయమును బహుసా మరికొన్ని శిథిలములై ఉండవచ్చును. మరికొన్ని పరివార దేవతల గుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ బాణ చోళరాజుల (క్రీ. శ. 9-12 శతాబ్దులు) కాలమున చెందినట్టివి. ముఖ్య దేవాలయము గోడలపైని, రాతిపలకలపైని పెక్కు శాసనములు ఉన్నాయి. ఇవి తరువాతి పల్లవులు, వారి సామంతులు గంగ పల్లవులు (క్రీ.శ. 897-905), బాణ చోళులు, చోళరాజు విక్రమచోళుడు, రాజరాజు కాలమునకు చెందినవి. యాదవ దేవరాయల కాలమునాటికి చెందిన మరికొన్ని శాసనములు ఉన్నాయి. విక్రమ చోళుడు కాలమున (క్రీ.శ.1126) దేవాలమును పూర్తిగా తిరుగ కట్ట
ినట్లు, రాతితో కట్టడములు చేసినట్లు తెలియుచున్నది. దేవాలయములో విశాలమైన మహామండపము గర్భగుడి ఆవలివైపు దాని ఆనుకొని ఎత్తైన రాతి ప్రాకారమును కలుపుచున్న అరుగు, నలుప్రక్కల ప్రదక్షిణమునకు వీలుగా స్తంభములపై శాల నిర్మింపబడెను.ఈ కాలమున మహామండపమునకు దక్షిణముగా ముఖద్వారము, దానికి నేరుగా ప్రాకారమును కూడా కుడ్యస్తంభములతో చక్కని ద్వారశాలను ఏర్పరచిరి. గర్భగుడి మాత్రము గజపృష్ఠాకారము కలిగి ఉంది. అందున అర్ధ మండపము మహామండపములు ఉన్నాయి. అన్నియు తూర్పు ముఖద్వారములు కలిగి ఉన్నాయి. గర్భగుడి, అర్ధ-మహామండపముల కన్న, చాలా పల్లములో ఉంది. అందువల్లనే కాబోలు ఈ గ్రామనామము గుడిపల్లము అని వాడుకలో ఉంది. శివుని ప్రతిమ, యవ్వనుడైన మల్లునిబోలి ఉన్నందున గ్రామనామము గుడిమల్లము అని ప్రతీతి. కాని శాసనములలో ఎక్కడా ఈనామము కానరాదు. ఈ గ్రామాన్ని విప్రపీఠముగా పేర్కొనబడెను. గుడిపేరు పరశురామేశ్వరాలయముగా చెప్పబడింది. చిత్రమేన ఈ ఆలయము నెవ్వరు ప్రతిష్ఠించిరో, ఎప్పుడు జరిగినో శాసనములు తెలుపుటలేవు. శాసనములు స్వామి వారి నిత్య సేవల కొరకు దానములు తెలుపుచున్నవి. ఇటీవలి పరిశోధనల ఫలితముగా ఇది క్రీ.పూ 1-2 శతాబ్దము. సంబంధించిన లింగముగా భావింపవచ్చును. ముఖ్య దేవాలయములోని మూలవిరాట్టు గుండ్రని రాతి పీఠములోని (యోని), లింగము (అడుగు భాగమున చతురస్రాకమైన స్తంభము) అమర్చబడెను. ఈ పీఠములు చాలా నునుపుగా లింగ మెంత సుందరముగా నున్నదో అట్లున్నవి. కాని రాయి వేరు- ఇసుకరాయి. ఈ యోని నిర్మాణము కేవలము స్త్రీ యోని నిర్మాణము బోలి యుండుట చాల చిత్రముగ ఉంది.పీఠము చుట్టును 1.35 మీటర్లు పొడవుతో నలుప్రక్కల చతురస్రాకారం నిర్మించబడెను.దీని చుట్టును స్తంభము శైలి, అమరావతి-మధురల స్తూపవేదిక స్తంభములను బోలియుండుట గమనార్హము. ఈ స్తంభ పలకములపైన వివిధ రీతుల పద్మములు, పూలు, చక్రములు మలచిఉన్నవి.ఈ కాలమున దేవాలయ కట్టడము లేదు.కేవలము లింగముపై ఆరుబయట పూజించబడునట్లు తెలియుచున్నది. ఈ లింగముపై, దానిపైన శివుని ప్రతిమ అతి ప్రాచీనమైన శైవపూజా విధానమును తెలుపుటయే కాక దక్షిణమున శైవ మత్యంత పురాతన మైనట్టిదని తెలియుచున్నది.ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగినాణాలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణాలు క్రీ.పూ. 3వ శతాబ్ధానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. అట్లే మధుర మ్యూజియంలో క్రీ.పూ.1 వ శతాబ్దమునకు చెందిన శిల్పము ఈ లింగమును పోలియున్నది. ఇది చెట్టు క్రింద ఎత్తైన ఆరు బయట వేదికలోనుంచి, పూజించబడు లింగముగా గోచరించును. ఈ లింగము ఊర్ధ్వరేతయైన మానవుని లింగమెట్లుండునో అట్లు చెక్కబడింది. నరముల వెలే కనిపించును లింగమధ్యభాగము. శివుని రూపము, లింగ ముఖభాగమున, చాల చక్కని యవ్వనుడిగా చూపడం జరిగింది. స్వామి రెండు కన్నులు, నాసికాగ్రమును చూచుటనుబట్టి విరూపాక్షుడగను, యోగ లేక ధ్యాన పురుషుడగను చెప్పుకొనవచ్చును. యెడమ భుజమ నానుకొని పరశు ఉంది.చేతిలో కుండ, కుండ మరొక చేతిలో పొట్టేలు (మృగము-బహుశ చర్మమే కాబోలు), తల క్రిందులుగా పట్టుకొని ఉన్నాడు. ఇచ్చట శివుని భిక్షాటన మూర్తిగా పోల్చుకొనవచ్చును. చక్కని ధోవతి మేఖలతో బంధించి యున్నను పురుషుని లింగము వెలికి యున్నట్లు చూపబడియుండుట చిత్రముగా ఉంది. ఇతడిని మనము రుద్రుడుగా శిశ్నిన దేవుడుగా ఊహించుట సమ్ంజసము. ఋగ్వేద రుద్రుడుకి జంధ్యము లేదు. ఈ ప్రతిమలో యజ్ఞపవీతము కానరాదు. పైగా స్వామి చలమూర్తి. అపస్మార పురుషుని భుజ స్కంధములపై ఉన్నాడు కావున, లింగము వ్రేలాడు చున్నట్లు చాలా సాధారణంగా చూపబడెను. కానీ గమనించినచో, శివలింగ మంతయు తీసికొన్నచో ఊర్ధ్వ రేతమనే చెప్పక తప్పదు. శివుని తలపాగా చిత్రముగా ఉన్నది, పట్టబంధముతో నొసలు పైకిగా కట్టబడింది. లేతతాటి ఆకు అల్లి చుట్టినట్లున్నది. దీనిని బట్టి దక్షిణామూర్తిగానో లేక కపర్దిగనో ఉద్దేంశింపబడినాడు. ఇట్టి సంయుక్త ప్రతిమయే తరువాత వివిధ రూపములలో ప్రత్యేకముగా శివుని చూపుటకు దోహదమై ఉండునని పలువురి అభిప్రాయము. యేల అనగా ఈ దేవాలయమును పూర్తిగా కట్టించి, పెద్దదిగా చేసిన తరువాత- పల్లవులు, చోళులు, బాణులు వివిధ రూపములలో శివుని ప్రతిమలను విడివిడిగా (దక్షిణామూర్తి, కంకాలమూర్తి, పశుపతమూర్తి, వీణాధారి, ఉమాసహితమూర్తి) దేవకోషములలో ఉంచిరి. ఈ వేదిక లింగము చుట్టునుమ చేసిన త్రవ్వకములలో క్రీ.శ.2-3 శతాబ్దములకు చెందినట్టి, ఇటుకలతో కట్టిన అర్ధగోళాకారపు గుడి-గోడకూడా బయల్పడినది. దీనిని బట్టి క్రీ.శ.2-3 శతాబ్దములలో బహుశ శాతవాహనులు - ఇక్ష్వాకులు కాలమున ఈ లింగము చుట్టును దేవాలయము కట్టిఉండవచ్చును. ఈ ఆలయము శిథిలమగుటచే పల్లవులు - బాణ - చోళులు దీనిని రాతితో, అదే ఆకృతిలో విశాలముగా కట్టి, కొన్ని మార్పులు, కూర్పులు గావించిరి.అప్పటి వాస్తునుబట్టి లింగము చుట్టునున్న వేదికను, గుండ్రని యోని పీఠమును, పూడ్చి వేయటం జరిగింది.చతురస్రమైన చిన్న పీఠికను మాత్రము చేసి అభిషేకజలము పోవుటకు ప్రణాళిని గావించిరి..